Tuesday, June 10, 2025

కేరళ తీరానికి అతి పెద్ద నౌక

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలోనే అతి పెద్ద సరుకు రవాణా నౌక, భారతదేశ ప్రతిష్టాత్మక ఎంఎస్‌సి ఇరినా సోమవారం కేరళ తీరంలోని విజింజం అంతర్జాతీయ రేవుకు చేరుకుంది. సరకుల రవాణా సమర్థతలో ఇది ఇతర నౌకల కన్నా చాలా ముందుంది. తెల్లవారుజామున ఈ కంటైనర్ షిప్ ఇక్కడికి చేరిన విషయాన్ని రేవు అధికారులు మీడియాకు తెలిపారు. ఈ కంటైనర్ షిప్ వెడల్పు 399. 9 మీటర్లు. కాగా వెడల్పు 61.3 మీటర్లు. ఈ విధంగా ఇది అంతర్జాతీయ ప్రామాణిక స్థాయి ఫుట్‌బాల్ మైదానం కంటే మించి ఉంటుంది. ఒక్కరోజు ఈ షిప్ ఇక్కడి రేవులో ఉంటుంది.

ఇది ఇక్కడికి చేరుకోగానే పోర్టు అధికారులు, సిబ్బంది సాంప్రదాయక జల అభివాదాల ఘట్టం చేపట్టారు. ఎంఎస్‌సి ఇర్నాను ప్రధాని మోడీ మే 2వ తేదీన లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ భారీ స్థాయి నౌక వాహక సామర్థం 24, 346 టిఇయూలు ఉంటుంది. సముద్ర జలాల ద్వారా సాగే అంతర్జాతీయ వ్యాపారంలో భారతదేశ కీలక పాత్రకు ఈ భారీ నౌక ప్రతీకగా నిలిచింది. కేరళ తీరానికి ఈ భారీ నౌక రావడం రాష్ట్రానికి చారిత్రక క్షణం అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ఈ నౌకకు కేరళ సాదర స్వాగతం పలుకుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News