హైదరాబాద్: సీనియర్ పాత్రికేయులు రాసిన విశ్లేషణలు మాకెంతో ఉపయోగపడతాయని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. వార్తా కథనాలను నిశితంగా గమనిస్తూ ఉంటానని అన్నారు. బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవ తెలంగాణ దినపత్రిక పదో వార్షికోత్సవాల్లో సిఎం పాల్లొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రసంగించారు. పరిపాలనపై పట్టు సాధించాలంటే విశ్లేషణలు చదవాలని, అన్ని అంశాలు ఒకే చోట క్రోడీకరించి విశ్లేషణలు రాయడం ఎంతో ఉపయోగకరమని తెలియజేశారు.
తప్పు చేసేవాళ్లను గద్దె దించడంలో కమ్యూనిస్టులు ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. అబద్ధాల ప్రాతిపదికన రాజకీయాలు చేయకూడదని నిర్ణయించుకున్నానని, ఎవరైనా బాగా నమ్మితేనే.. మోసం చేస్తారని పేర్కొన్నారు. కమ్యూనిస్టులు ఉప్పులాంటి వారు..ఎన్ని మసాలాలు ఉన్నా.. ఉప్పు లేకపోతే వంటకు రుచి రాదని, సమస్యలు పరిష్కారం కోసం కమ్యూనిస్టులు పోరాడతారని ప్రశంసించారు. 2024 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిదంటే కారణం కమ్యూనిస్టులేనని, సమస్యలను కమ్యూనిస్టుల ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్లే తాము అధికారంలోకి వచ్చామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.