Tuesday, July 8, 2025

మళ్లీ అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: వైసిపి నేత వల్లభనేని వంశీ మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వంశీ శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతుండటంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వంశీ సోమవారం ఉదయం కోర్టుకు హాజరైన అనంతరం అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం వంశీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, వల్లభ నేని వంశీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News