- Advertisement -
రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం, ధర్మారం గ్రామానికి చెందిన అన్నవేణి తిరుపతి (36) అనే యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఈ నెల 5న క్రిమి సంహారక మందు తాగడంతో కుటుంబసభ్యులు అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస వదిలాడు. మృతునికి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
- Advertisement -