Monday, June 2, 2025

మాదాపూర్‌లో దారుణం

- Advertisement -
- Advertisement -

యువకుల మందుపార్టీ….
బాటిల్ ఇవ్వలేదని యువకుడి దారుణ హత్య
తల్లి పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులకు మద్యం పార్టీ
నిందితులకు మద్యం ఇవ్వకపోవడంతో బాధితుడిపై బాటిళ్లతో దాడి
అక్కడికక్కడే మృతిచెందిన జయంత్‌గౌడ్
ఇద్దరు మైనర్ నిందితుల అరెస్టు

మద్యం ఇచ్చేందుకు నిరాకరించిన యువకుడిని ఇద్దరు బాలురు దారుణంగా హత్య చేసిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున 2గంటలకు చోటుచేసుకుంది. మాదాపూర్ ఇన్స్‌స్పెక్టర్ కృష్ణమోహన్ కథనం ప్రకారం…. మణికొండ, ఖాజాగూడకు చెందిన జయంత్‌గౌడ్ (18) శుక్రవారం తన తల్లి లక్ష్మి పుట్టిన రోజు కావడంతో కేక్‌ను తీసుకువద్దామని రాత్రి 10 గంటల సమయంలో స్నేహితులతో కలిసి కొండాపూర్ వచ్చి కేకును తీసుకొని జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం స్నేహితులతో కలిసి హైటెక్ సిటీలోని యశోద ఆస్పత్రి వెనుక వైపు ఉన్న ఉన్న నిర్మానుశ్య ప్రాంతానికి మద్యం సేవించడానికి వెళ్లారు. జయంత్‌గౌడ్‌తో పాటు అతడి స్నేహితులు మరో 7 మంది కలిసి మద్యం సేవిస్తున్నారు. ఈ క్రమంలోనే రాత్రి 1.30 గంటల సమయంలో మద్యం సేవిస్తుండగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి ముత్రవిసర్జనకు వచ్చారు.

మద్యం తాగుతున్న జయంత్ గౌడ్, స్నేహితుల వద్దకు వచ్చిన నిందితులు తమకు మద్యం ఇవ్వాలని కోరారు. మద్యం ఇచ్చేందుకు జయంత్ గౌడ్ నిరాకరించాడు, దీంతో నిందితులు వారితో వాగ్వాదానికి దిగారు. ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన నిందితులు బాధితులు తాగుతున్న మద్యం బాటిళ్లను పగులగొట్టి జయంత్ గౌడ్‌ను విచక్షణ రహితంగా పొడిచారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో యవోద ఆస్పత్రి వెనుక వైపు హత్య జరిగిందని డయల్ 100 సమాచారం వచ్చింది. వెంటనే మాదాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రక్తం మడుగులో ఉన్న జయంత్ గౌడ్‌ను యశోద ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ ఇన్స్‌స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపారు. జయంత్‌గౌడ్‌పై బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదయినట్లు తెలిపారు.

గంజాయి మత్తులో….
జయంత్ గౌడ్‌ను హత్య చేసిన ఇద్దరు మైనర్లు గంజాయి మత్తులో ఉన్నారు. గంజాయి సేవించిన నిందితులు జయంత్ గౌడ్ వద్దకు వెళ్లి మద్యం ఇవ్వాల్సిందిగా కోరారు. దానికి జయంత్ గౌడ్ నిరాకరించడంతో అక్కడే ఉన్న మద్యం బాటిళ్లను పగులగొట్టి విచక్షణారహితంగా పొడిచి పారిపోయారు. అక్కడి నుంచి వెళ్లిన తర్వాత నిందితులు తెల్లవారుజామున 5గంటలకు జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేసి ఏమి తెలియనట్లు బయట తిరిగారు. నిందితులను గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News