Thursday, June 19, 2025

దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాదాపూర్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతదేహం నీళ్లలో కనిపించడంతో పోలీసులు బయటకు తీశారు. మృతదేహం అడ్డగుట్టకు చెందిన సుష్మాదిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అడ్డగుట్టలో అంజయ్య అనే వ్యక్తి తన భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఆయన కూతురు సుష్మా హైటెక్ సిటీలో ఓ కంపెనీలో జాబ్ చేస్తోంది.

జాబ్‌కు వెళ్లిన యువతి ఇంటికి రాకపోవడంతో కంపెనీ మేనేజర్‌కు తండ్రి అంజయ్య ఫోన్ చేశాడు. రాత్రి 8.30కు కంపెనీ నుంచి ఇంటికి వెళ్లిందని సమాచారం ఇచ్చాడు. ఆమె ఫోన్ కు పలుమార్లు కాల్ చేసి స్విచ్ఛాఫ్ రావడంతో స్నేహితులు, బంధువులకు కాల్ చేసి అడిగారు. దుర్గం చెరువులో యువతి మృతదేహం కనిపించడంతో ఆయనకు పోలీసులు సమాచారం ఇచ్చారు. మృతదేహం తన కూతురుదేనని గుర్తించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమలో విఫలం కావడంతో చనిపోయిందా? లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అని పోలీసులు కాల్ డేటాను ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే విషయం ఇంకా బయటకు రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News