- Advertisement -
భూ తగాదాల నేపథ్యంలో సొంత అన్ననే తమ్ముడు కొట్టి చంపిన సంఘటన జగిత్యాల జిల్లా, పెగడపల్లి మండలం, ఐతుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన మండలంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..ఐతుపల్లి గ్రామానికి చెందిన కూన నర్సయ్య, కూన రాములు అన్నదమ్ములు. వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా భూమి విషయంలో వివాదాలు నెలకొన్నాయి. గురువారం గ్రామంలో పెద్దమ్మ బోనాల పండగ జరిగింది. అనంతరం రాత్రి మద్యం మత్తులో భూమి వివాదం మనసులో పెట్టుకున్న తమ్ముడు రాములు అన్న నర్సయ్య (50)ను కర్రతో తల మీద కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య కూన రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రవి, ఇన్చార్జి ఎస్ఐ రవీందర్ తెలిపారు.
- Advertisement -