- Advertisement -
ఆన్లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని దేశాయిపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ(20) అనే యువకుడు ఇంటర్మీడియట్ పూర్తి చేసి కారు మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బెట్టింగ్ కు బానిసైన వంశీ.. గత మూడేళ్లుగా బెట్టింగ్కు ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడుతూ.. స్నేహితులు, పరిచయస్తుల దగ్గర దాదాపు రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. ఈ విషయం తెలుసుకొన్న కుటుంబ సభ్యులు.. వంశీని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన వంశీ.. పొలం వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో కుటుంబం సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
- Advertisement -