మహానాడు కార్యక్రమం ఒక పెద్ద డ్రామా అని, ఆ కార్యక్రమంలో చంద్రబాబు ఫోజులిస్తూ బిల్డప్ ఇస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. కడపలో మహానాడు నిర్వహణ హీరోయిజమ్ కాదన్న ఆయన, జగన్ను తిట్టడం హీరోయిజం కాదని, అసలు హీరోయిజం అంటే హామీలు అమలు చేయడమని వెల్లడించారు. కానీ ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు నెరవేర్చలేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో సమావేశంలో గుర్తు చేశారు.
సమావేశంలో వైయస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబూ గుర్తు పెట్టుకో. మీ కార్యకర్తను ఇంటింటికీ తిప్పే సత్తా ఉందా? అని ప్రశ్నిస్తున్నాను. ఇది వైయస్సార్సీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి తేడా అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం, ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికొదిలేశారు. 143 హామీలను పూర్తిగా పక్కన పెట్టారు. చిన్న హామీ అయిన ఉచిత బస్సు కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారని, కడపలో మహిళలు చంద్రబాబు ఎప్పుడు ఉచిత బస్సు అని చెబుతాడా విశాఖపట్నం వెళ్లి వద్దామా అని ఎదురు చూస్తున్నారు. మరో చిన్న హామీ ఉచిత గ్యాస్. ఆ గ్యాస్ సిలిండర్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారని విమర్శించారు.