అమరావతి: తల్లులకు చేకూర్చే లబ్ది చూసి ఓర్వలేకే వైసిపి విషప్రచారం చేస్తుందని ఎపి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. పాఠశాలలు తెరచిన రోజే పుస్తకాలు, నాణ్యమైన విద్యా కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తల్లికివందనం కింద ఒక్కరోజులో విద్యార్థులకు రూ. 10 వేల కోట్ల లబ్ది ఓ రికార్డు అని అన్నారు. మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్ స్వీకరించే ధైర్యం వైసిపిలో ఒక్కరికైనా ఉందా? అని ప్రశ్నించారు. నిన్నటి దాకా వైసిపి సైకోలు (YCP Psychos) మహిళలను కించపరిచారని, ఇప్పుడు తల్లులు ఆనందంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. రంగులు, బొమ్మల పిచ్చితో గత పాలకులు విద్యా వ్యవస్థను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, టీచర్ల నియామకంపైనే కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
తల్లుల ఆనందం చూసి తట్టుకోలేకపోతున్నారు: గొట్టిపాటి
- Advertisement -
- Advertisement -
- Advertisement -