- Advertisement -
చెన్నై: తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఐటి ఉద్యోగినిపై జెప్టో డెలవరీ బాయ్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మడిపాక్కానికి చెందిన ఐటి ఉద్యోగిని జెప్టో యాప్లో ఆర్డర్ చేసింది. గోపినాథ్ అనే డెలవరీ బాయ్ మహిళ ఆర్డర్ చేసిన వస్తువులను డెలవరీ చేశాడు. సెల్ఫోన్లో ఛార్జింగ్ లేదని, కాసేపు చార్జింగ్ పెట్టాలని ఆమెను డెలవరీ బాయ్ కోరాడు. దీంతో అతడిని ఇంట్లోకి ఆమె అనుమతించింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెపై గోపినాథ్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. సదరు మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -