Thursday, May 2, 2024

కారు, ఆటో ఢీ.. 12 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

12 injured in Road accident in Kovur Palli

అమరావతి: నెల్లూరు జిల్లా కోవూరు పల్లి వద్ద శనివారం ఎన్ హెచ్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి అదుపు తప్పిన కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాద సమయంలో ఆటోలో 17 మంది మహిళలు ప్రయాణిస్తున్నట్లు బాధితులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News