Wednesday, September 17, 2025

మడగాస్కర్‌లో తొక్కిసలాట: 13 మంది మృతి

- Advertisement -
- Advertisement -

అంటానానరివో: మడగాస్కర్ రాజధాని అంటానానరివోలో ఇండియన్ ఒసియన్ ఐలాండ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో తొక్కిసలాట జరగడంతో 13 మంది మృతి చెందగా వంద మందికి పైగా గాయపడ్డారు. మృతులలో ఏడుగురు చిన్నారులు ఉన్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. బారియా స్టేడియంలో 50 వేల మంది ప్రేక్షకులు కూర్చొనే వీలు ఉంది. ఒకేసారి రావడంతో తొక్కిసలాట జరిగినట్టు సమాచారం. తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో చెప్పులు వేలాదిగా ఉన్నాయి. గత నలబై ఏళ్ల నుంచి హిందూ మహాసముద్ర దీవుల మధ్య క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ప్రతి నాలుగు సంవత్సరాల ఒకసారి ఈ క్రీడలు జరుగుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News