Saturday, April 20, 2024

టిఎస్‌పిఎస్సీ పేపర్ లీకేజీలో మరో 13మంది డిబార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్‌పిఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్ అయ్యారు. భవిష్యత్తులో నిర్వహించే పరీక్షలు రాయకుండా వీరిని డిబార్ చేయాలని కమిషన్ నిర్ణయించింది. దీనిపై అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. సిట్ ఇప్పటివరకు అరెస్టు చేసిన 37 మందిని డిబార్ చేసింది.

తమ నోటిఫికేషన్‌లోని నిబంధనలను అనుసరించి లీకేజీ కేసులు ప్రమేయమున్న వారు భవిష్యత్తులో టిఎస్‌పిఎస్సీ పరీక్షలు రాయకుండా నిషేదం విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈనిషేదం అమల్లో ఉంటుందని పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 50 మంది అభ్యర్థులు డిబార్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News