Sunday, April 28, 2024

పాఠశాల వసతి గృహంలో భారీ అగ్నిప్రమాదం.. 13మంది విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

అగ్ని ప్రమాదంలో13మంది విద్యార్థులు మరణించిన విషాద సంఘటన చైనాలో చోటుచేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి చైనా హెనాన్‌ ప్రావిన్స్‌ లోని యింగ్‌కాయ్‌ పాఠశాల వసతి గృహంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి.. క్రమంగా వసతి గృహంతో వ్యాపించాయి. దీంతో మంటల్లో చిక్కుకుని 13 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

మరికొంతమంది విద్యార్థులు త్రీవంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి మంటలను అర్పారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News