Wednesday, April 24, 2024

ఢిల్లీలో మళ్లీ భూప్రకంపనలు..

- Advertisement -
- Advertisement -

ఉత్తర భారతదేశంలోని ఢిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో మంగళవారం భూప్రకంపనలు సంభవించగా బుధవారం కూడా భూకంపం నమోదైంది. దేశరాజధానిలో భూకంపం తీవ్రత రిక్టర్‌స్కేలుపై 2.7గా నమోదైంది. భూకంప కేంద్రం ఢిల్లీకి 17కిలోమీటర్ల దూరం, 5 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ బుధవారం ప్రకటించింది.

కాగా మంగళవారం రాత్రి 6.8తీవ్రతతో సంభవించిన భూకంపం ఢిల్లీని వణికించింది. అఫ్గాన్‌లోని హిందూ కుష్‌ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News