Monday, April 29, 2024

బైక్ పై లారీ బోల్తా పడి ఇద్దరు మృతి..

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద ఓ లారీ, బైకుపై బోల్తా పడింది. ఈ ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News