Tuesday, March 19, 2024

2 లక్షల ‘సహారా’ పాలసీలు ఎస్‌బిఐ లైఫ్‌కు అప్పగింత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్(ఎస్‌ఐఎల్‌ఐసి)కి చెందిన 2 లక్షల మందికి చెందిన పాలసీల బాధ్యతలను చూసుకోవాల్సిందిగా ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని ఐఆర్‌డిఎఐ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా) కోరింది. సహారా లైఫ్ రెగ్యులేటర్ నిర్దేశించిన నిబంధనలను పాటించకపోవడం, మరోవైపు ఈ సంస్థ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడంతో 2017లో ఐఆర్‌డిఎఐ ఆంక్షలు విధించింది. సహారా లైఫ్ పాలసీదారులకు సజావుగా విధివిధానాలు నడిచేందుకు జీవిత బీమా, యాక్చురీలు, ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ నుండి నిపుణుల సభ్యుల బృందాన్ని బీమా రెగ్యులేటర్ ఐఆర్‌డిఎఐ ఏర్పాటు చేసింది. ఈ మార్పు సమయంలో పాలసీ హోల్డర్లందరూ జాగ్రత్తగా ఉండేలా ఈ బృందం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. పాలసీదారుల సందేహాలు, ఆందోళనలకు ప్రతిస్పందించడానికి ఎస్‌బిఐ లైఫ్ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తుంది.

వారు తమ వెబ్‌సైట్‌లో ముఖ్యమైన సమాచారాన్ని కూడా పంచుకుంటారు. ఏప్రిల్‌లో ఎస్‌బిఐ లైఫ్‌కు ఎంతో ఉత్తమంగా ఉంది. ఈ సంస్థ కొత్త బిజినెస్ ప్రీమియంలో మొత్తం రూ. 1,336.87 కోట్లు వసూలు చేయగా, ఇది గత ఏడాది ఇదే నెల కంటే 8 శాతం ఎక్కువగా ఉంది. ఇప్పుడు సహారా పాలసీలు జత చేరనున్నాయి. అయితే సహారా ఇండియా లైఫ్‌కి 2004లో బీమాను విక్రయించడానికి అనుమతి ఇచ్చారు. వారు తమ బీమా పాలసీలను కొనుగోలు చేసిన వ్యక్తులకు తగినంత సహాయం చేయలేదు. అనేక అవకాశాలు, తగినంత సమయం ఇచ్చినప్పటికీ, వారు పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కంపెనీ పోర్ట్‌ఫోలియో క్షీణించడంతో వారు డబ్బును కోల్పోవాల్సి వచ్చింది. బీమా పాలసీలను కొనుగోలు చేసిన వ్యక్తులకు సరిగ్గా న్యాయం చేయలేకపోయింది.

ఐఆర్‌డిఎఐ ప్రకారం, సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోంది, చెల్లించే క్లెయిమ్‌ల మొత్తం వారు ప్రీమియమ్‌లుగా పొందే మొత్తం డబ్బుతో పోలిస్తే పెరుగుతోంది. ఇది కొనసాగితే సహారా మరిన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. పాలసీ హోల్డర్‌లకు వారి బాధ్యతలను తీర్చడానికి వారి వద్ద తగినంత డబ్బు ఉండదు. పాలసీదారుల ప్రయోజనాలు ప్రమాదంలో ఉన్నాయని, అందుకే ఎస్‌బిఐ లైఫక్ అప్పగించాల్సి వచ్చిందని సంస్థ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News