Friday, April 19, 2024

దుండిగల్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: నగర శివార్లలోని దుండిగల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి దుండిగల్‌ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ డీసీఎం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News