Friday, March 29, 2024

కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రెండేళ్ల చిన్నారి మృతిచెందిన సంఘటన ఎల్‌బి నగర్‌లో ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం…ఎన్‌టిఆర్ నగర్‌లో ఉండే హబీబుద్దిన్, శశిరేఖ దంపతులకు ధనలక్ష్మి(2) ఉంది. శశిరేఖ బ్యూటీషియన్‌గా విధులు నిర్వర్తిస్తోంది. విధులు నిర్వర్తించేందుకు మన్సూరాబాద్‌కు భార్య భర్త, కూతురు బైక్ వచ్చారు.

తిరిగి ఇంటికి వెళ్తుండగా గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కామినేని ఆస్పత్రి రోడ్డులో ఆగిఉన్న కారు డ్రైవర్ ఒక్కసారిగా డోర్ తెరవడంతో వెనుక నుంచి వచ్చిన వీరి బైక్‌కు తగిలింది. దీంతో ఒక్కసారిగా బైక్ అదుపు తప్పడంతో శశిరేఖ, చిన్నారి ధనలక్ష్మి రోడ్డుపై పడిపోయారు. రోడ్డుపై పడడంతో చిన్నారి ధనలక్ష్మి తలకు తీవ్ర గాయాలు కావడంతో కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ చిన్నారి ధనలక్ష్మి మృతిచెందింది.

కేసు నమోదు చేసుకున్న ఎల్‌బి నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా చిన్నారి మృతికి కారణమైన కారు డ్రైవర్ కారును వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. డ్రైవర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News