Monday, April 29, 2024

మయన్మార్‌లో నిరాశ్రయుల క్యాంప్‌పై శతఘ్ని దాడి: 29 మంది మృతి

- Advertisement -
- Advertisement -

నెపిడా (మయన్మార్) : మయన్మార్ లోని లైజా అనే ప్రదేశంలో సోమవారం అర్ధరాత్రి నిరాశ్రయులు ఉంటున్న ఓ క్యాంప్‌పై శతఘ్ని దాడి జరిగి దాదాపు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 44 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది చిన్నారులు ఉన్నారు. ఈ దాడి జరిగిన ప్రదేశం కచిన్ ఇండిపెండెన్స్ ఆర్గనైజేషన్ అనే వేర్పాటువాద గ్రూపు అధీనంలో ఉంది. తాజా దాడిలో చనిపోయిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు.

ఈ దాడి వెనుక సైనికహస్తం ఉందనే అనుమానాలున్నాయి. ఇదే నిజమైతే గత కొన్నేళ్లలో కచిన్ వేర్పాటు వాదులపై చేసిన అతిపెద్ద దాడి ఇదే అవుతుంది. అయితే ఈ దాడి వెనుక తమ హస్తం లేదని సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఝా మిన్‌తున్ వివరణ ఇచ్చారు. బహుశా వేర్పాటువాదుల మందుగుండు నిల్వలు పేలి ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా కచిన్ వేర్పాటు వాదులు మయన్మార్ సైనిక ప్రభుత్వంతో పోరాడుతున్నారు. దీంతో వీరికి సామాన్య ప్రజల్లో మద్దతు పెరిగింది. మయన్మార్‌లో అత్యంత శక్తివంతమైన వేర్పాటువాద గ్రూపుల్లో కచిన్ నేషనల్ ఆర్మీ ఒకటి. ఈ దాడిపై మయన్మార్ లోని ఐరాస కార్యాలయం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. “ ఐడీపీ క్యాంప్‌లు శరణార్ధులకు నిలయాలు. అవి ఎక్కడ ఉన్నా వాటిని లక్షంగా చేసుకోకూడదు” అని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News