Saturday, July 27, 2024

ఎంపిల్లో 49 శాతం మంది పై కేసులు

- Advertisement -
- Advertisement -

కొత్తగా ఎన్నికైన ఎంపిలలో ఈసారి క్రిమినల్ కేసులు ఉన్న వారు 49 శాతం అని ఎడిఆర్ నివేదికలో స్పష్టం అయింది. అంకెల ప్రకారం చూస్తే విజేతల్లో 251 మందిపై కేసులు ఉన్నాయి. వీరిలో 27 మంది దోషులుగా ఖరారయిన వారు కూడా ఉన్నారు. దిగువసభలో ఇంత మంది ఎంపిలపై కేసులు ఉన్న దాఖలాలు ఇంతకు ముందు లేవని అధ్యయనంలో తేలింది. 233 మంది ఎంపిలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలియచేసుకున్నారు. క్రిమినల్ కేసులు ఉన్న ఎంపిల సంఖ్య 2009తో పోలిస్తే ఇప్పుడు 55 శాతానికి పెరిగింది. కళంకిత జాబితాలోని ఎంపిలలో తీవ్రస్థాయి నేరాలు అంటే రేప్‌లు, హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడినట్లు వచ్చిన అభియోగాలను ఎదుర్కొంటున్న వారి సంఖ్య ఇప్పుడు 170 వరకూ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News