Wednesday, September 17, 2025

బుద్గామ్‌లో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని బుద్గామ్‌లో ఐదుగురు ఉగ్రవాదులను సైనిక బలగాలు అరెస్ట్ చేశాయి. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాదులకు లష్కరె తొయిబాతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది.

అమరనాథ్ యాత్రకు ఆటంకం కలిగించాలని ఉగ్రవాదులు లక్షంగా కుట్ర పన్నుతున్నట్టు సమాచారం అందడంతో పోలీస్‌లు, భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. అరెస్టయిన వారిని రౌఫ్ అహ్మద్, హిలాల్ మాలిక్, తౌఫిక్ దార్, డానిష్ అహ్మద్, షౌకత్ అలీగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News