Monday, April 29, 2024

మేడారం మహా జాతరకు 6 వేల ప్రత్యేక బస్సులు

- Advertisement -
- Advertisement -

టిఎస్ ఆర్‌టిసి ఎండి విసి సజ్జనార్

హైదరాబాద్: మేడారం మహా జాతరకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ తెలిపారు. రెగ్యులర్ సర్వీసులు తగ్గించడంతో సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అందువల్ల భక్తులకు, ఆర్టీసి సిబ్బందికి సహకరించాలని కోరుతూ ఆయన సామాజిక మాధ్యమంలో ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను టిఎస్‌ఆర్టీసి నడుపుతోందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి ఆర్టీసి నడుపుతోందని ఎండి సజ్జనార్ తెలిపారు.

రెగ్యులర్ సర్వీసులను తగ్గించాం
జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు తిప్పుతున్నందున రెగ్యులర్ సర్వీసులను తగ్గించినట్టు ఆయన తెలిపారు. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉందని, కావున జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసి సిబ్బందికి పెద్ద మనుసుతో ప్రయాణికులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణకే తలమానికమైన ఈ జాతరను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని సజ్జనార్ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News