Saturday, July 27, 2024

మధ్యప్రదేశ్ రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్‌లోని సియోని, రాజ్‌గఢ్, ఛింద్వారా జిల్లాలలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మరణించగా మరో 20 మందికి పైగా గాయపడ్డారు. సియోనిలోని ఆదెగావ్ పోలీసు స్టేషన్ పరిధిలోగల హినోతియా గ్రామంలో సోమవారం ఉదయం ఒక ఎస్‌యువి బోల్తాపడి ముగ్గురు వ్యక్తులు మరణించగా వధూవరులతో సహా మరో ఐదుగురు గాయపడ్డారు. రాజ్‌గఢ్‌లోని కురేవర్ పోలీసు స్టేషన్ పరిధిలో 46 నంబర్ నేషనల్ హైవేపైన సోమవారం ఉదయం ఒక మిలిటరీ ట్రక్కును మరో రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా మరో 15 మంది గాయపడ్డారు. ఛింద్వారా జిల్లాలో ఆదివారం రాత్రి ఎస్‌యువి బోల్తా పడి ముగ్గురు మహిళలు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News