Monday, April 29, 2024

నిర్మల్ లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

3 Killed in Road Accident in Nirmal

నిర్మల్: జిల్లాలోని క‌డెం మండ‌లంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం మండలంలోని బెల్లాల్ సమీపంలో వేగంగా వెళ్తున్న ఓ ఆటో అదుపుత‌ప్పి పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఆటోలో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు వ్య‌క్తులు ఘటనాస్థలంలోనే మృతి చెందగా, మ‌రో న‌లుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఆటో కడెం నుంచి బెల్లాల్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతిచెందిన వారిని బెల్లాల్ కు చెందిన సీమల శాంత(55), అన్నాపూర్ గ్రామానికి చెందిన శంకరవ్వ(52), మల్లన్నపేటకు చెందిన మల్లయ్య(55)లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

3 Killed in Road Accident in Nirmal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News