Wednesday, May 15, 2024

పురుగుల మందు తాగి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం

- Advertisement -
- Advertisement -

Family commit suicide in Adibatla

హైదరాబాద్: అప్పుల బాధలు తాళలేక ఓ దంపతులు తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పురుగుల మందు తాగి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల ప్రాంతం కుర్మల్‌గూడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మలక్‌పేటలో కుద్దూర్ కుటుంబం నివసిస్తోంది. దంపతులు తన కూతుళ్లు ఫిర్దోస్, మెహక్ బేగమ్‌తో సహా కుర్మల్ గూడ చెరువు వద్దకు చెరుకున్నారు. నలుగురు పురుగుల మందు సేవించిన తరువాత చెరువులో దూకారు. మంగళవారం తెల్లవారుజామున మూడు శవాలు కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాలను బయటకు తీశారు. మృతులు మలక్‌పేట చెందిన వారిగా గుర్తించారు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News