Saturday, September 13, 2025

ఎన్‌కౌంటర్‌లో హిజ్‌బుల్ ఉగ్రవాది మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ రాష్ట్రం కుల్గామ్ జిల్లాలోని ఖండిపోరా ప్రాంతంలో శనివారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. ఖండిపోరా శివారులో ఉగ్రవాదులు సంచిరిస్తున్నారని సమాచారం రావడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఎదురుకాల్పుల్లో హిజ్‌బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ చెందిన వ్యక్తి మృతి చెందాడని ఆర్మీ అధికారి తెలిపాడు. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News