Friday, May 24, 2024

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడి ఐదుగురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరిగింది. సంగీత ట్రావెల్స్ చెందిన బస్సు ఒడిశాలోని చిన్నపల్లి నుంచి విజయవాడకు వస్తుండగా చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఘటనా స్థలంలో దుర్మరణం చెందగా పది మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను భద్రాచల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు ఒడిశాకు చెందిన సునేనా హరిజన్(2), జీతు హరిజన్(05), ధనేశ్వర్ దళపతిగా గుర్తించారు. మరో ఇద్దరు వివరాలు తెలియలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వాహనాన్ని క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News