Friday, May 3, 2024

ఇంగ్లాండ్ లక్ష్యం 138

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ముందు 138 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఉంచింది. ఇంగ్లాండ్ బౌలర్లు వరసగా వికెట్లు తీస్తూ పాక్ వెన్నువిరిచారు. పాక్ బ్యాట్స్‌మెన్లలో షాన్ మసూద్ ఒక్కడే ధాటిగా ఆడాడు. మసూద్ 28 బంతుల్లో 38 పరుగులు చేశాడు. కెప్టెన్ బాబర్ అజమ్ 28 బంతుల్లో 32 పరుగులు చేశాడు. మిగితా బ్యాట్స్‌మెన్లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. ఇంగ్లాండ్ బౌలర్లలో శ్యామ్ కరన్ మూడు వికెట్లు, అదిల్ రషీద్, క్రిష్ జోర్డాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా బెన్ స్టోక్స్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News