Saturday, May 31, 2025

కృష్ణ మృతిపట్ల ప్రధానమంత్రి సంతాపం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న కృష్ణ మంగళవారం ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు. సూపర్‌స్టార్‌ కృష్ణ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. కృష్ణ ఓ లెజెండరీ నటుడన్నారు. తన విలక్షణ నటనతో ఎందరో హృదయాలను గెలుచుకున్నారని కొనియాడారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News