Tuesday, April 30, 2024

రైళ్లలో ఇకపై స్థానిక ఆహార పదార్థాలు అందుబాటులోకి

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రైళ్లలో ఇకపై స్థానిక ఆహార పదార్థాలు అందుబాటులోకి రానున్నాయి. రైళ్లలో ప్రయాణికులకు స్థానిక ఆహార పదార్థాలు అందించేలా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. డయాబెటిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి అవసరమయ్యే వంటకాలు సహా, శిశువులు, ఆరోగ్య ప్రియుల కోసం ప్రత్యేక ఆహారాన్ని రైల్వే అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

ఈ మేరకు మెనూ మార్చుకునే వెసులుబాటును ఐఆర్‌సిటిసి కల్పిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాంతీయ వంటకాలు, సీజనల్ ఆహార పదార్థాలను మెనూలో చేర్చుకునేందుకు ఐఆర్‌సిటిసికి అనుమతులు జారీ చేసింది. రైళ్లలో కేటరింగ్ సేవలు మెరుగుపర్చడం సహా, ప్రయాణికులకు భిన్నరకాల వంటకాలను అందించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

చిరుధాన్యాలతో చేసే స్థానిక ఉత్పత్తులు…

చిరుధాన్యాలతో చేసే స్థానిక ఉత్పత్తులను మెనూలో భాగం చేసుకోవచ్చని రైల్వే బోర్డు సూచించింది. పండుగల వేళ ప్రత్యేక ఆహార పదార్థాలు సైతం విక్రయించవచ్చని పేర్కొంది. శిశువులకు ఉపయోగపడే ఆహారంతో పాటు వివిధ వయసుల వారి అభిరుచులకు తగ్గ ఆహారాన్ని అందించేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని రైల్వే బోర్డు పేర్కొంది.

ఎంఆర్‌పి ధరకే తినుబండరాలు అందించాలి

ప్రస్తుతం రైల్వే బోర్డు ఆమోదించిన మెనూనే ఐఆర్‌సిటిసి కొనసాగిస్తోంది. రైల్వే బోర్డు ముందస్తు ఆమోదంతోనే ఈ మెనూలో ఆహార పదార్థాలను చేరుస్తుంది. ముందుగా నోటిఫై చేసిన ధరల ప్రకారమే ప్రీపెయిడ్ రైళ్లలో మెనూను ఐఆర్‌సిటిసి నిర్ణయిస్తుంది. ప్రస్తుతం బోర్డు తీసుకున్న నిర్ణయం ఆధారంగా భోజనంలో భాగంగా కాకుండా ప్రత్యేకంగా ఆర్డర్ చేసే ఆహారాలు, బ్రాండెడ్ పదార్థాలను ప్రీపెయిడ్ రైళ్లలో ఎంఆర్‌పి ధరకు విక్రయించేందుకు రైల్వే బోర్డు అనుమతిచ్చింది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల మెనూలో ఉండే బడ్జెట్ ఆహార పదార్థాల ధరలను సైతం ఐఆర్ జనతా రైళ్లలో మెనూ, ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News