Wednesday, June 18, 2025

కాగజ్‌నగర్‌లో పెద్దపులి కలకలం

- Advertisement -
- Advertisement -

 

కాగజ్‌నగర్‌: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ శివార్లలో కొందరు వ్యక్తులకు పులి కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. కాగజ్‌నగర్‌లోని చెక్‌పోస్టు సమీపంలో ఒక పులి రోడ్డు దాటుతున్నట్లు కనిపించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పంజా గుర్తులను గుర్తించారు.

స్థానికులు మీడియాతో మాట్లాడుతూ.. రోడ్డు పక్కనే ఉన్న పొదల్లో కేకలు వినిపించాయని తెలిపారు. అధికారులు వెంటనే పులిని పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఓ గిరిజనుడిపై పులి దాడి చేసి సమీపంలోని కొండపైకి ఈడ్చుకెళ్లిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News