Tuesday, April 30, 2024

కర్నూలులో ప్రమాదం: ముగ్గురు స్పాట్‌లోనే మృతి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: కర్నూలు జిల్లా కోడుమూరు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బైకును ఢీకొని, తర్వాత కల్వర్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి విషమం కావడంతో కోడుమూరు సర్కార్ దవాఖానకు తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గా ఉందని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News