Monday, May 6, 2024

పంత్ ఔట్… భారత్ 147/4

- Advertisement -
- Advertisement -

చట్టోగ్రామ్: జహుర అహ్మాద్ చౌదరీ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్టు తొలి రోజు మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 44 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 147 ఆటను కొనసాగిస్తోంది. రిషబ్ పంత్ 46 పరుగులు చేసి హసన్ మిరాజ్ బౌలింగ్‌లో మెహిడీకి క్యాచ్ ఇచ్చి నాల్గో వికెట్ రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఛటేశ్వరా పూజారా(33), శ్రేయస్ అయ్యర్(23) బ్యాటింగ్ చేస్తున్నారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ రెండు వికెట్లు పడగొట్టగా కలీద్ అహ్మాద్, మెహిడీ హసన్ మిరాజ్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News