Monday, May 6, 2024

చేర్యాల జడ్పీటిసిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..

- Advertisement -
- Advertisement -

 

సిద్ధిపేట : వాకింగ్‌కు వెళ్ళిన జడ్పీటిసిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం గుర్జకుంటలో చోటు చేసుకుంది. సోమవారం ఉదయం వాకింగ్‌కు వెళ్ళిన చేర్యాల జడ్పీటిసి శెట్టి మల్లేశంపై గుర్తు తెలియని దుండగులు గొడ్డళ్లు, కత్తులతో దాడి చేయడంతో ఆయన  తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి జడ్పీటిసిని ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబీకులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News