Tuesday, May 7, 2024

ఎన్ఎస్పీ కాలువ లో ఇద్దరు వ్యక్తులు గల్లంతు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: కాలువ లో పైప్ వేసేందుకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయిన సంఘటన కల్లూరు (మం) కప్పల బంధం సమీపంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..  ఎన్ఎస్పీ కాలువ లో పైప్ వేసేందుకు గురువారం ఇద్దరు వ్యక్తులు దిగారు.

ఈ క్రమంలో  ప్రమాదవశాత్తు కాలువలో పడి ఇద్దరు రైతులు గల్లంతైనారు. గల్లంతైన వారు గుర్రాల లక్ష్మారెడ్డి (53),లక్కిరెడ్డి రామిరెడ్డి (45) కప్పలబంధం గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గల్లంతైన వారి కోసం వెతకటం ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News