Sunday, September 14, 2025

గ్యాస్ ధరల పెంపుకు వ్యతిరేకంగా ధర్నా

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి : కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధర రూ.50 పెంచడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాద్యక్షులు చింతకుంట విజయరమణారావు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై గురువారం వంట గ్యాస్ ధరల పెంపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో కాళీ సిలిండర్లతో ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News