Wednesday, May 8, 2024

నార్సింగి ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః అతివేగం వల్ల టాటా ఏస్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన నార్సింగి ఓఆర్‌ఆర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పెద్ద అంబర్ పేట నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఒక్కసారిగా అదుపు తప్పింది.

దీంతో డివైడర్‌ను ఢీకొట్టింది, అందులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వ్యక్తిని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News