Tuesday, April 30, 2024

హజ్ దరఖాస్తుదారుల కోసం పాస్‌పోర్ట్ కార్యాలయం ప్రత్యేక కౌంటర్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హజ్ -2023 దరఖాస్తుదారుల పాస్‌పోర్ట్‌ల జారీ కోసం ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం రెండు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. బేగంపేట, సికింద్రాబాద్‌లలో ప్రత్యేక కౌంటర్లలో ఒక్కరోజులోనే 250 పాస్‌పోర్టు దరఖాస్తులను పరిష్కరించారు. దరఖాస్తుదారులు గడువులోపు హజ్‌కు దరఖాస్తు చేసుకునేలా అవసరమైన అన్ని అంశాలను అనుసరించి… మార్చి 10 లోపు పాస్‌పోర్ట్‌లు జారీ చేసేలా చూస్తామని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి డి.బల్లయ్య తెలిపారు.

హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీమ్,  డి.బల్లయ్యను కలిసి మార్చి 10వ తేదీలోపు పాస్‌పోర్టులు మంజూరు చేస్తే,  ఆన్‌లైన్‌లో హజ్ దరఖాస్తులు సమర్పించనున్న ఆసక్తి గల అభ్యర్థుల జాబితాను అందజేశారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 10న ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రారంభించింది,  మార్చి 10 చివరి తేదీ.  ప్రాతినిధ్యం అనంతరం ఆర్పీఓ బేగంపేట, సికింద్రాబాద్‌లో రెండు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ హజ్ కమిటీ దాదాపు 450 మంది సిఫార్సు లేఖలను ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారికి అందజేసింది.

సోమవారం పెండింగ్‌లో ఉన్న యాత్రికుల పాస్‌పోర్టు దరఖాస్తులను పరిష్కరించనున్నారు. కాగా, తెలంగాణ హజ్ కమిటీ హజ్ 2023 కోసం ఆన్‌లైన్‌లో ఇప్పటి వరకు 5,200కు పైగా దరఖాస్తులు అందుకోగా.. 1200కి పైగా కవర్ నంబర్లు జారీ చేయబడ్డాయి. ఇదిలావుండగా హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ గడువును మార్చి 10 తర్వాత కూడా పొడిగించాలని భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News