Sunday, May 5, 2024

మతిస్థిమితం లేని భార్య… భర్తను చంపి… మృతదేహంతో ఐదు రోజులు…

- Advertisement -
- Advertisement -

రాంఛీ: మతిస్థిమితంలేని మహిళ తన భర్తను హత్య చేసి మృతదేహంతో ఐదు రోజులు ఉన్న సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం జంషెడ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. అమర్‌నాథ్ సింగ్ అనే వ్యక్తి రియల్ స్టేట్ వ్యాపారం చేస్తూ సుభాష్ కాలనీలో నివసిస్తున్నాడు. అమర్‌నాథ్ భార్యకు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో దంపతుల మధ్య గొడవలు జరిగేవి. అమర్‌నాథ్ ఐదు రోజుల నుంచి కనిపించకపోవడంతో పాటు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లోకి ఎవరు రాకుండా కరెంట్ వైర్ బిగించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి అతడి కుమారుడికి సమాచారం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News