Sunday, April 28, 2024

రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం రాజేంద్ర నగర్ లోని శాస్త్రీపురంలో ఉన్న ఓ గోదామ్ లో ప్రమాదవశాత్తు మంటలు అలుముకుని భారీగా ఎగసిపడుతున్నాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో గోదామ్ వద్ద పార్క్ చేసిన రెండు డీసిఎంలు దగ్ధమయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News