Tuesday, April 23, 2024

శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శనివారం శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్ట్‎మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుండగా.. స్లాటెడ్ సర్వ దర్శనానికి 6 గంటల సమయం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు సమయం పడుతున్నట్లు సమాచారం.

ఇక, శుక్రవారం శ్రీవారిని 62,938 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.స్వామివారికి 36,784 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.24 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News