Thursday, May 2, 2024

Marriage: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

చెన్నై: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తుండగా పిట్స్ రావడంతో యువకుడు మృతి చెందిన సంఘటన తమిళనాడు రాష్ట్రం శ్రీపెరంబుదూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కర్నూల్ జిల్లాకు చెందిన సత్యసాయి రెడ్డి(20) తమిళనాడులోని ఓ ప్రైవేటు కాలేజీలో విద్యనభ్యసిస్తున్నాడు. సత్యసాయి స్నేహితురాలి సోదరి వివాహ వేడకకు హాజరయ్యాడు. పెళ్లి బరాత్ తీస్తుండగా సత్యసాయి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. డ్యాన్స్ చేస్తుండగా పిట్స్ వచ్చి చేవిలో నుంచి రక్తం కారింది. పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News