Tuesday, May 7, 2024

పదో తరగతి విద్యార్థినులకు సైకిళ్ళు పంపిణీ

- Advertisement -
- Advertisement -

హత్నూర: ఎస్‌ఎస్ వి ఫ్యాబ్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ వారు ఇంప్యాక్ట్ పాట్నర్ పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ వారి సహకారంతో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని చింతల్ చెరు ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి విద్యార్థినులకు సైకిళ్ళు పంపిణీ చేశారు. అదే విధంగా ఐటీడబ్ల్యు సిగ్నోడ్ పరిశ్రమ మేనేజర్ ఆదిశేఖర్ రాజు సైతం పదవ తరగతి, ఏడవ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు అరుణ, దత్తాద్రిలు దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News