Friday, August 22, 2025

మహారాష్ట్రలో పిడుగుపాటు.. బొగ్గు గని కార్మికుడు మృతి (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

చంద్రపూర్: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పిడుగుపాటుకు గురై ఓ కూలీ మృతి చెందడంతో విషాదం నెలకొంది. సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాబూధన్ యాదవ్ అనే బాధితుడు భద్రావతి తాలూకాలోని మజ్రీ బొగ్గు గనిలో విధులు ముగించుకుని బహిరంగ ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. వేల వాట్ల విద్యుత్ అతని శరీరం గుండా ప్రవహించడంతో అతను కుప్పకూలిపోయి తక్షణమే ప్రాణాలు కోల్పోయాడు. ఘటన జరిగిన సమయంలో బీహార్‌కు చెందిన యాదవ్‌ బొగ్గు గనిలో కూలీగా పనిచేస్తున్నాడు. పిడుగుపాటు వల్లే మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News