Friday, March 29, 2024

‘యాధ్గిరి అండ్ సన్స్’ ట్రైలర్ విడుదల

- Advertisement -
- Advertisement -

శ్రీ వేంకటేశ్వర క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అనిరుధ్, యశస్విని జంటగా బిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో.. చంద్రకళ పందిరి నిర్మించిన రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ స్టోరీ ‘యాద్గిరి అండ్ సన్స్’. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా నేడు చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బిక్షపతి రాజు పందిరి మాట్లాడుతూ.. ‘‘ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ స్ఫూర్తితో రూపుదిద్దుకున్న చిత్రం. ఈ చిత్రంలో నటీనటుల పాత్రలు చాలా క్యాజువల్‌గా, నాచురల్‌గా ఉంటాయి. ఈ చిత్రంలో సీనియర్ ఆర్టిస్టులైన జీవా, రాజీవ్ కనకాల యాక్టింగ్ అద్భుతంగా వుంటుంది. మార్తాండ్. కె. వెంకటేష్‌గారి ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. అన్ని హంగులతో యాధ్గిరి & సన్స్ చిత్రాన్ని మే 5న రిలీజ్ చేయనున్నాము. అలాగే నేడు మా సినిమా ట్రైలర్ ను విడుదల చేశాం.ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News