Friday, August 29, 2025

లక్నోకు బెంగళూరు షాక్

- Advertisement -
- Advertisement -

లక్నో: ఐపిఎల్‌లో భాగంగా సోమవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో బెంగళూరుకు ఇది ఐదో విజయం. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు స్వల్ప లక్ష్యాన్ని సయితం కాపాడుకుని విజయం సాధించడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఓపెనర్లు కోహ్లి (31), డుప్లెసిస్ (44) మాత్రమే రాణించగా మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లక్నో 19.5 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. కృష్ణప్ప గౌతమ్ (23), అమిత్ మిశ్రా (19) మాత్రమే కాస్త రాణించారు. మిగతా వారు విఫలం కావడంతో లక్నోకు ఓటమి తప్పలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News