Thursday, May 9, 2024

చిలకలూరిపేటలో యువతులతో నగ్న పూజలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రపదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నగ్న పూజల కలకలం సృష్టిస్తోంది. నకిలీ పూజారి నాగేశ్వర రావు ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. నగ్నంగా పూజలు చేస్తే రూ.50 వేలు ఇస్తామంటూ మహిళ సాయంతో ముగ్గురు యువతులను నాగేశ్వర రావు మోసం చేశారు. వారం రోజులైన డబ్బులు ఇవ్వకపోవడంతో యువతులు నిలదీశారు. యువతులను గోరంట్ల సమీపంలో నాగేశ్వర రావు వదిలేశారు. యువతులు దిశ యాప్ ద్వారా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. గతంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా పలువురు మహిళతో నగ్నంగా పూజలు చేస్తున్నట్టు నాగేశ్వర రావుపై ఆరోపణలు వస్తున్నాయి. మంత్రాల పేరుతో మహిళలతో నగ్నంగా పూజలు చేయించేవాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు బయటకు వస్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయి.

Also Read: సిఎం సీటెవరిది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News