Saturday, April 27, 2024

నిండు గర్భిణీపై మరిది అత్యాచారం

- Advertisement -
- Advertisement -

భోపాల్: నిండు గర్భిణీపై దూరపు బంధువు మరిది అత్యాచారం చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. రాజస్థాన్‌కు చెందిన దంపతులు జీవినోపాధి కోసం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్నారు. 35 ఏళ్ల మహిళ ఎనిమిది నెలల గర్భిణీగా ఉంది. తన భర్తతో కలిసి బెరిషియా ప్రాంతంలో తన బంధువులు ఇంటికి వెళ్లింది. ఆమె భర్త రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు.

ఆమె తన మరదలు ఇంటికి వెళ్లింది. మరదలు పనులు నిమిత్తం బయటకు గర్భిణీ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. మార్చి 4న వరసకు మరదియ్యే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసి ఎవరికైనా చంపేస్తానని బెదిరించాడు. భర్తతో ఇంటికి వచ్చిన తరువాత భార్య జరిగిన విషయం చెప్పడంతో నిందితుడిని నిలదీశారు. ఈ విషయం బయటకు ఇద్దరిని చంపేస్తానని బెదిరించారు. వెంటనే వారు వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News